కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్.. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమా వారిసు. తెలుగులో వారసుడుగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ సినిమాకు ముందు నుంచి మహేష్ నటించిన మహర్షి సినిమా రీమేక్ అని, టాలీవుడ్ లో వచ్చిన పలు సినిమాల ఉంటుందని అభిమానులు చెప్పుకొస్తూనే ఉన్నారు.
అయితే ఈ సినిమా యూనిట్ మాత్రం ఇది కొత్త కథ అని.. ఒక కుటుంబ కథ చిత్రం అని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇక రీసెంట్గా వరీసు ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేయగా.. అది చూసిన తర్వాత నెటిజన్లు.. ఒక ఉమ్మడి కుటుంబం ముగ్గురు కొడుకులు.. ఒక పెద్ద బిజినెస్ మాన్.. అతనికి చిన్న కొడుకు అంటే పడదు. ఇక అతను బయటికి వెళ్లిపోతాడు తండ్రి కంపెనీకి కష్టం రావడంతో మళ్ళీ తిరిగి వచ్చి ఆ కంపెనీని నిలబడతాడు. కుటుంబాన్ని కలుపుతాడు.
ఇప్పుడు ఈ ట్రైలర్ను చూస్తుంటే కొన్నేళ్ల క్రితం వచ్చిన గౌతమ్ssc సినిమా స్టోరీ గుర్తుకు వస్తుంది. ఇక ఆ సినిమాలో నవదీప్ హీరోగా నటించాడు. అతనికి తండ్రి పాత్రలో నాజర్ నటించగా.. ఈ సినిమాలో కూడా ముగ్గురు కొడుకులు చిన్నవాడైన నవదీప్ జులాయి బయటకు వెళ్లిపోతాడు. మధ్యలో తన కుటుంబ సమస్యలను అన్నదమ్ములు విడిపోవడానికి ట్రై చేస్తారు. వారిని కలవడానికి నవదీప్ కష్టపడతాడు. తన తండ్రికి తెలియకుండా గొప్పవాడై తండ్రి వద్దకు వస్తాడు.
వరీసు ట్రైలర్ చూస్తుంటే సేమ్ ఈ సినిమాను చూసినట్టే అనిపిస్తుంది. రెండిటిలో నటీనటులు మార్పు తప్ప మిగతా ది సేమ్ టు సేమ్. అని కొందరు ఈ సినిమా కోసమేనా దిల్ రాజు అన్ని పోరాటాలు చేశాడని మరికొందరి కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమా విడుదలై ఎలాంటి సెన్షేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.