ఈ సంక్రాంతికి నటసింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో రాబోతుంటే.. మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో సందడి చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. వీర సింహారెడ్డి సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వాహిస్తే.. వాల్తేరు వీరయ్యను బాబీ తెరకెక్కించాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.
అలాగే ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించారు. వీరసింహారెడ్డి జనవరి 12న విడుదల కానుండగా.. వాల్తేరు వీరయ్య జనవరి 13న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. అయితే బుకింగ్స్ లో వీర సింహారెడ్డి ముందు వీరయ్య వెలవెలబోతోంది.
తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అయితే అమెరికా, ఆస్ట్రేలియా మరియు యూకే లో ఈ సినిమా ల యొక్క అడ్వాన్స్ బుకింగ్ స్టార్ చేశారు. ఈ మూడు చోట్ల కూడా వీర సింహారెడ్డి సినిమా యొక్క అడ్వాన్స్ బుకింగ్ అత్యధికంగా నమోదు అయినట్లుగా డిస్ట్రిబ్యూటర్స్ వెల్లడించారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే.. మూడు చోట్ల బాలయ్య సందడే ఎక్కువగా కనిపిస్తోందని అంటున్నారు. మరి ఇలాగైతే అక్కడ వీరయ్య చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా ఓపెనింగ్స్ పై భారీ ప్రభావం పడుతుందని అంటున్నారు.