టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. తన బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేసి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు. అమెరికాలో జాబ్ అయినప్పటికీ.. కరోనా ప్రభావం కారణంగా ఆమె హైదరాబాద్ లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారట.
శర్వా చేసుకోబోయే అమ్మాయి రెడ్డి కుటుంబానికి చెందిన అమ్మాయి అని తెలిసింది. ఆమె మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి కుమారుడు సుధీర్ సోదరి కుమార్తె అట. 38 ఏళ్ల శర్వానంద్ ఫైనల్ గా ఎన్నారై అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్నాడు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం అని తెలుస్తోంది.
అంతేకాదు, శర్వానంద్ ఎంగేజ్మెంట్ డేట్ ను కూడా లాక్ చేశారట. శర్వానంద్ ఎంగేజ్మెంట్ ఈ నెల 26న జరగబోతోంది. కుటుంబసభ్యులు మరియు అతి కొద్ది మంది బంధుమిత్రలు మాత్రమే శర్వా నిశ్చితార్థానికి హాజరు కానున్నారట. ఇక పెళ్లి ఏప్రిల్ లో ఉంటుందని.. శర్వా డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్నాడని తెలుస్తోంది.