ఈ సంక్రాంతికి తమిళంలో ఇద్దరు స్టార్ హీరోలు తలపడిన సంగతి తెలిసిందే. అందులో అజిత కుమార్ ఒకరు కాగా.. విజయ్ దళపతి మరొకరు. అజిత్ `తునివు(తెలుగు తెగింపు)` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జనవరి 11న తెలుగు తమిళ భాషల్లో అట్టహాసంగా విడుదలై మిక్స్డ్ రివ్యూలను సొంతం చేసుకుంది.
అలాగే విజయ్ `వరిసు(తెలుగు వారసుడు)` సినిమాతో వచ్చాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి కూడా మిక్స్డ్ టాకే లభించింది. అయితే పండుకు అడ్వాంటేజ్ తో తమిళంలో ఈ రెండు చిత్రాలు అదిరిపోయే రేంజ్ లో వసూళ్లను రాబట్టాయి.
ఇకపోతే ఇప్పుడు ఈ రెండు చిత్రాలు ఓటీటీ నెల తిరక్క ముందే సందడి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు ఒకే రోజు ఓటీటీలో రాబోతున్నాయి. ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో వారసుడు తెలుగు తమిళ భాషల్లో స్విమ్మింగ్ కానుంది. అలాగే తెగింపు ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లెక్స్ లో అదే తేదీన స్ట్రీమింగ్ కాబోతోంది. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందట. మొత్తానికి థియేటర్స్ లో తలపడిన ఈ రెండు చిత్రాలు ఇప్పుడు ఓటీటీ వేదికగా వార్ కు రెడీ అవుతున్నాయి.