యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీను ఎప్పుడో ప్రకటించారు. అయితే షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. గత ఏడాది మొత్తం అప్పుడు ఇప్పుడు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళలేదు.
ఇక ఫిబ్రవరిలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని ఇటీవల చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే తాజాగా మేకర్స్ ఈ మూవీ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేసేశారట. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ మూవీని అట్టహాసంగా ప్రారంభించబోతున్నారట. ఇక ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారని టాక్ నడుస్తోంది.
అలాగే రాజమౌళి, రామ్ చరణ్, కీరవాణి ఇలా `ఆర్ఆర్ఆర్` టీం మొత్తం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారట. అయితే చిరంజీవి కొరటాల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. అందుకు కారణం ఆచార్య ఎపిక్ డిజాస్టర్ కావడమే. చిరంజీవి పలుమార్లు పరోక్షంగా కొరటాలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో వీరిద్దరి మధ్య చెడిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలకు చెక్ పెట్టేందుకే `ఎన్టీఆర్ 30` ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా కొరటాల చిరంజీవిని ఆహ్వానించారని టాక్.