సావిత్రి, సౌందర్య, సాయి పల్లవిలో ఉన్న కామన్ విషయాలివే!

సినిమా పరిశ్రమకి ఎంతమంది హీరోయిన్లు వచ్చినా, కొంతమంది సావిత్రి, సౌందర్య, సాయి పల్లవిలో ఉన్న కామన్ విషయాలివే!మాత్రం చాలా ప్రత్యేకతని సంతరించుకుంటారు. అలాంటివారిలో మహానటి సావిత్రి ఒకరు. అప్పట్లో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఉర్రుతలూగించారు. ఇక్కడకి వచ్చిన చాలామందిలాగా గ్లామరస్ రోల్స్ ని నమ్ముకోవడం కాకుండా తనదైన నటనతో వెండి తెరపైన తిరుగులేని నటిగా వెలుగొందింది. అందుకే నేటికీ ఆమె పేరు వినిపిస్తుందంటే దానికి గల కారణాల గురించి ప్రత్యేకించి ఇక్కడ చర్చించుకోవలసిన అవసరం లేదు.

ఆ తరువాత కాలంలో ఆమెలాగా కాకపోయినా ఆస్థాయి నటనతో ఎన్నో హోమ్లీ పాత్రలలో నటించి వెండితెరకే సౌందర్యాన్ని తెచ్చిన నటిపేరు సౌందర్య. ఆమె నటించిన దాదాపు అన్ని సినిమాలు అప్పట్లో సూపర్ డూపర్ హిట్లయ్యేవి. అందుకే ఏరికోరి ఆమెని బడా హీరోలు తమ సినిమాలలో పెట్టుకునేవారు. చిరంజీవిని మొదలుకొని బాలకృష్ణ, నాగార్జున, వెనకటేష్ సరసన నటించి యావత్ తెలుగు మహిళలకు ఆరాధ్య నటిగా అవతరించారు సౌందర్య. అందుకే ఆమెని ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తారు.

ఇలా అలాంటి నటీమణులు కరువయ్యారు అనే తరుణంలో కేరళనుండి తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు నటి సాయి పల్లవి. మొదటినుండి ఆమె చాలా ప్రత్యేకమైన సినిమాలను చేస్తూ ఆహుతులను అలరిస్తోంది. ముఖ్యంగా కథానాయక పాత్రలనే ఎన్నుకుంటూ తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన మార్క్ ని క్రియేట్ చేసుకుంది. అందుకే ఇపుడు తెలుగునాట ఆమెకు చాలా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈ ముగ్గురిలో వున్న కామన్ పాయింట్ ఏమంటే గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండటం. అటువంటి పాత్రలు చేస్తే వారికి ఏ రకంగా పారితోషికం ఇస్తారో ఊహించుకోవచ్చు. అయినా అలాంటి పాత్రలు చేయకుండా తమదైన శైలిలో పాత్రలను ఒప్పుకుంటూ మెప్పించడం వలన వీరు చాలా ప్రత్యేకమైనవారు అయ్యారు.