ఈ ఏడాది ఫిబ్రవరి 17న బాక్సాఫీస్ వద్ద పోటీపడే చిత్రాలు ఇవే..?

2023 బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ పడేందుకు చాలా సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఇక ముందుగా ఈ కొత్త సంవత్సరంలో సంక్రాంతి కానుకగా టాలీవుడ్ సీనియర్ హీరోలైన బాలకృష్ణ- చిరంజీవి తమ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. వీరితో పాటు పలు డబ్బింగ్ సినిమాలు కూడా పోటీ పడుతున్నాయి.
ఇప్పటికే బాలకృష్ణ వీర సింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలకు సంబంధించిన టీజర్ సాంగ్స్ ప్రేక్షకుల ముందుకు రాగా.. మరో రెండు రోజుల్లో ఈ సినిమాల ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమాల తర్వాత వచ్చే ఫిబ్రవరిలో కూడా ఏం మాత్రం త‌గ్గ‌కుండా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో మరి ముఖ్యంగా ఫిబ్రవరి 17న చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే ఆ రోజున‌ ఏ సినిమాలు వస్తున్నాయో కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసేసారు. మరి ఆ రోజు రాబోతున్న భారీ బడ్జెట్ సినిమాల్లో గుణశేఖర్ ”శాకుంతలం” ఒకటి. ఈ సినిమాలో స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా అదే రోజున రాబోతుంది. అయితే ఆ సినిమాలకు ఇప్పటివరకు ఎలాంటి బజ్ క్రియేట్ అవ్వలేదు. మరి ముందు ముందు అయినా ఆ సినిమాలుకు బజ్ క్రియేట్ అవుతుందో లేదు చూడాలి.

ఇక మరో పెద్ద సినిమాగా ధనుష్ ‘సార్’ ఇది కూడా అరోజునే రాబోతుంది. ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఈ రెండు పెద్ద సినిమాలతో పాటు మరో రెండు చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ పోరులో ఉన్నాయి. వాటిలో ఒకటి కిరణ్ సబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ కాగా.మరో సినిమా విశ్వక్ సేన్ ధమ్కీ కుడా అదే రోజున రిలీజ్ కాబోతుంది. అయితే ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే కానీ నిలదొక్కుకోవడం కష్టం.