కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఈ సంక్రాంతికి వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. టాలీవుడ్ దర్శకుడు వంశీపైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగు టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంత గ్రాండ్గా నిర్మించారు. ఈ క్రమంలోనే హీరో విజయ్ కి తన తండ్రికీ మాటల్లేవని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయాన్ని విజయ్ తండ్రి స్పష్టం చేశాడు.
సంవత్సరం కాలంగా మా ఇద్దరి మధ్య సరిగ్గా మాటల్లేవని ఆయన చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయం గురించి అంతగా చర్చించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నాడు. ప్రతి ఇంట్లోనూ ప్రతి తండ్రి, కొడుకులు మధ్య ఎలాంటి చిన్న చిన్న సమస్యలు రావడం సహజం.. మళ్లీ తిరిగి కలుసుకోవడం సహజమే..! ఇలాంటి చిన్న విషయాన్ని పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని విజయ్ తండ్రి చెప్పాడు.
రీసెంట్గా ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ తండ్రి చంద్రశేఖర్.. ‘విజయ్కు నేనంటే ఎంతో ఇష్టం.. నాతో ఎంతో స్నేహంగా ఉంటాడు.. నేను ఎంతో ఇష్టంగా ప్రేమించే సినిమా తర్వాతే నా కొడుకు విజయ్ కే ప్రాధాన్యమిస్తా ఆ తర్వాతేనా భార్య.. ఫ్యామిలీ అన్నాక కొన్ని విషయాల్లో చిన్న చిన్నమనస్పర్థలు రావడం సహజమే.. నేను విజయ్ దాదాపు సంవత్సరం నుంచి సరిగ్గా మాట్లాడుకోవడం లేదు’.
అయితే ఇది మా ఇద్దరి దృష్టిలో అంత పెద్ద సమస్య కాదు.. ఏ కుటుంబంలోనైనా గొడవలు పడటం కలవడం సహజం.. తండ్రి, కొడుకుల అనుబంధం లో ఇలాంటి సంఘటనలు మామూలే.. ఇక విజయ్ నటించిన వారిసు సినిమాను సంక్రాంతికి మేమంతా కలిసి చూసాం. కాగా విజయ్ పొలిటికల్ ఎంట్రీ పైనే ఈ తండ్రి, కొడుకుల మధ్య విభేదాలు వచ్చాయి. ఇక దీంతో తండ్రి నిర్వహించే పొలిటికల్ ఈవెంట్స్ కి తనకు సంబంధం లేదని స్వయంగా విజయ్ చెప్పుకొచ్చాడు.