శృతి హాసన్ అరుదైన రికార్డు.. ఈ జనరేషన్‌లో మ‌రెవ‌రికీ సాధ్యం కాలేదుగా!

సీనియ‌ర్ స్టార్‌ కమలహాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హోదాను అందుకున్న అందాల భామ శృతిహాసన్.. ఈ సంక్రాంతికి రెండు సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమయింది. నేడు ఈ భామ నుంచి `వీర సింహారెడ్డి` విడుదలైన సంగతి తెలిసిందే. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.

ఇక రేపు మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న `వాల్తేరు వీరయ్య` విడుదల కానుంది. ఈ సినిమాపై సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా శృతిహాసన్ ఖాతాలో ఈ జనరేషన్ లో ఎవరికీ సాధ్యం కానీ ఓ అరుదైన రికార్డు వచ్చి పడింది. ఇద్దరు సీనియర్ బడా స్టార్ హీరోలతోనే కాకుండా వారి త‌న‌యుల‌తోనూ న‌టించిన హీరోయిన్ గా అరుదైన ఘ‌న‌త‌ను శృతి సొంతం చేసుకుంది.

చిరంజీవితో `వాల్తేరు వీర‌య్య‌`లో న‌టించిన శృతి.. ఆయ‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ తో `ఎవ‌డు` సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది. అంతేకాదు చిరు త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్, మేన‌ల్లుడు అల్లు అర్జున్ తోనూ శృతి న‌టించింది. ఇక మ‌రోవైపు బాల‌య్య‌తో `వీర సింహారెడ్డి` సినిమా చేసిన ఈ భామ‌.. ఆయ‌న త‌న‌యుడు ఎన్టీఆర్ తో `రామయ్యా వస్తావయ్య `లో మెరిసింది. మొత్తానికి మెగా తండ్రీ తనయులతో పాటు నందమూరి బాబాయి అబ్బాయిల‌తోనూ న‌టించిన ఏకైక హీరోయిన్ గా శృతి రికార్డు క్రియేట్ చేసింది.