నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. తొలి సీజన్కు మించి రెండో సీజన్ భారీ రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. ఈ సీజన్లో ప్రభాస్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు కూడా బాలయ్యతో సందడి చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్ రెండు భాగాలుగా అహాలో స్ట్రీమింగ్ అవుతుండగా.
అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ఇప్పుడు ఈ సంక్రాంతికి ఓ స్పెషల్ ఎపిసోడ్ రాబోతుంది. బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి మూవీ టీమ్ బాలయ్య షోలో సందడి చేయబోతున్నారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా ముగించారు. ఇప్పుడు తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేయగా యూట్యూబ్లో భారీ వ్యూస్ నుు దక్కించుకుంటుంది.
ఈ ఎపిసోడ్లో దర్శకుడు గోపీచంద్ మాలినేని, వరలక్ష్మి శరత్ కుమార్ మరియు హనీ రోజ్తో పాటు ఈ సినిమాలో విలన్ గా నటించిన దునియా విజయ్ కూడా బాలయ్యతో సందడి చేశాడు. ఈ ప్రోమోలో బాలయ్య వీళ్ళతో సరదాగా చిట్ చాట్ చేశాడు. అంతేకాకుండా బాలయ్య ఫోన్లో మాస్ మహారాజా రవితేజతో కూడా మాట్లాడటం హైలెట్ గా నిలిచింది. ఫోన్లో రవితేజ తో మాట్లాడుతూ 100 కోట్ల హీరోకి కంగ్రాట్స్ అని రవితేజ అని ఆటపట్టించాడు.
అప్పుడు రవితేజ కూడా బాలయ్య తో థాంక్యూ తమ్ముడు అని అంటాడు అది చూసేందుకు ఎంతో సుల్లిగా ఉంటుంది. ఇక బాలయ్య గోపీచంద్ మలినేని ఒక ప్రశ్న అడుగుతూ క్రాక్ సినిమా రాకముందు రెండు సంవత్సరాల పాటు మీ కెరియర్ పరంగా ఎంతో ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలోనే మీ ఆస్తులను కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అలాంటి కష్ట సమయంలో నీ మానసిక స్థితి ఎలా ఉంది అంటూ బాలయ్య గోపీచంద్ ను అడిగాడు.. ఆ ప్రశ్నకు చాలా ఎమోషనల్ గా సమాధానం చెబుతూ.. దర్శకుడు ఏం చెప్పాడో తెలియాలంటే 13 వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్లో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.