అలనాటి హీరోయిన్ సదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ముఖ్యంగా జయం సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో కూడా నటించింది. తాజాగా హీరోయిన్ సదా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హీరో విక్రమ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అపరిచితుడు సినిమా గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా తెలియజేసింది.
సదా మాట్లాడుతూ అపరిచితుడు సినిమా షూటింగ్ సమయంలో ఎంతో సరదాగా సాగిపోయింది అని విక్రమ్ కు తనకు మధ్య సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉండేవని ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ బాగా వచ్చేవి అని..అయితే ఆ సీన్ చేసిన తర్వాత విక్రమ్ తనను చెల్లి అని పిలిచేవారు. నేను కూడా ఆయన్ని అన్నా అని పిలిచేదాన్ని సీన్ చేయగానే చెల్లి అనగానే సెట్లో అందరూ కూడా నవ్వే వాళ్ళు ఈ విషయం డైరెక్టర్ శంకర్ కి చివరిలో తెలిసిందని తెలుపుతోంది సదా. విక్రమ్ నేను అన్నాచెల్లెళ్లని పిలుచుకుంటున్న విషయం డైరెక్టర్ శంకర్ కి తెలిసి చాలా సీరియస్ అయ్యారని కూడా తెలుపుతోంది.
ఆ సమయంలో మీరు ఏం చేస్తున్నారో తెలుసా? మీరు ఇలా అన్న చెల్లి అని పిలుచుకుంటున్న విషయం బయట తెలిస్తే ఎలా ఉంటుంది మిమ్మల్ని సినిమాలో స్క్రీన్ మీద చూస్తే అన్నా చెల్లి అనే భావన వారికి కలిగితే చాలా ఇబ్బంది ఉంటుందని హెచ్చరించారట. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సదా బుల్లితెర మీద కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఉంటోంది. ఇక అంతే కాకుండా ఇప్పటికీ వివాహం చేసుకోకుండా సింగిల్ గా ఉండడంతో అభిమానులు ఇమే వివాహం కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సినిమాలలోకి రీఎంట్రీ ఇవ్వాలని చాలా ఆత్రుతతో ఉంటుంది సదా. సరైన కథ దొరికితే ఖచ్చితంగా ఇస్తానని తెలుపుతోంది.