మెగాస్టార్ చిరంజీవి మరికొన్ని గంటల్లో `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. జనవరి 13న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అయితే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిరంజీవి ఈటీవీ లో సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న ‘అడ్డా’ ప్రోగ్రాం కి గెస్ట్ గా హాజరు అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. అలాగే వ్యక్తిగత విషయాలను సైతం షేర్ చేసుకున్నారు. `మీ ఫోన్ లో ఎవరెవరి నంబర్స్ ఎలా సేవ్ చేసుకున్నారో చెప్పండి` అంటూ సుమ పలువురు పేర్లు చెప్పింది. సురేఖ నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నారు అని అడగగా ‘రే’ అని చేసుకున్నాను అని చెప్తాడు చిరంజీవి.
ఆ తర్వాత రామ్ చరణ్ నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నారు అని ప్రశ్నించగా.. ‘చెర్రీ’ అని తెలిపారు. ఆపై పవన్ కాంటాక్ట్ ని ఏమని సేవ్ చేసుకున్నారు అని సుమ ప్రశ్నించగా.. ఆడిటోరియం మొత్తం అభిమానుల అరుపులతో దద్దరిల్లిపోతుంది. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. `పీకే నో లేదా పవనో కాదు కళ్యాణ్ బాబు అని సేవ్ చేసుకున్నాను` అంటూ తెలిపారు. దీంతో ఈయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.