పాపం..ఆ మాటలు భరించలేకపోతున్న సమంత .. లైవ్ లోనే ఏడ్చేసింది..!!

టాలీవుడ్ ఒక్కప్పటి ఫేమస్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న గుణశేఖర్ తెరకెక్కించిన సినిమా “శాకుంతలం”. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత.. ఈ సినిమాలో శకుంతల దేవిగా కనిపిస్తుంది. కాగా ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే ట్రైలర్ ని రిలీజ్ చేశారు . ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తనదైన స్టైల్ లో నటించి..సమంత స్పెషల్ అటెన్షన్ ని గ్రాబ్ చేసుకుంది. అంతేకాదు దుశ్యంతుడు పాత్రలో కనిపించిన మలయాళీ నటుడు దేవ్ మోహన్ కూడా తనదైన స్టైల్ లో ఈ పాత్రలో మెరిశాడు.

శాకుంతలం ట్రైలర్ ఈవెంట్లో భాగంగా ప్రెస్ మీట్ ను కండక్ట్ చేశారు చిత్ర బృందం . ఈ కార్యక్రమానికి సమంత, నీలిమ గుణ, గుణశేఖర్, దిల్ రాజు , హీరో దేవ్ మోహన్ హాజరయ్యారు . కాగా ట్రైలర్ ఈవెంట్లో భాగంగా స్టేజ్ పై మాట్లాడుతూ.. గుణశేఖర్ ఎమోషనల్ అయ్యారు. ” నాలాంటి మేకర్స్ ఎంతోమంది ఉంటారు.. కానీ ఆ టాలెంట్ను గుర్తించి దిల్ రాజు లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే అది అభిమానులకు చేరగలదు”.. అంటూ చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే గుణశేఖర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంటాడు .

కాగా అది చూసిన సమంత కూడా తన ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేస్తుంది. దీనితో సోషల్ మీడియాలో ప్రస్తుతం సమంత – గుణశేఖర్ ఎమోషనల్ అయిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు విడాకులు తీసుకున్న తర్వాత నుంచి సోషల్ మీడియాలో సమంత పై హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుంది. అయితే వాటిని ఏమాత్రం పట్టించుకొని సమంత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకొని ముందుకెళ్తుంది. కాగా శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17న గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది, కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని చిత్ర మేకర్స్ భావిస్తున్నారు..!!