లడ్డు లాంటి ఆఫర్ ని పట్టిన పూరీ.. మరో లడ్డూ కావాలా నాయనా..?

సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ అన్న పదం వినిపించగానే అందరికీ గుర్తొచ్చే పేరు పూరి జగన్నాథ్ . ప్రజెంట్ అంటే ఆయన టైం బాగోలేక ఆయన పేరు పాపులారిటీ లిస్టులో లేదు కానీ ..గతంలో పూరి జగన్నాథ్ పేరు చెప్తే చొక్కాలు చించేసుకుని అరిచేసే జనాలు ఎంతో మంది ఉన్నారు . అంతెందుకు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాజ్యమేలుస్తున్న ఎంతోమంది హీరోస్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది పూరి జగన్నాథ్ నే అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఓ ఇడియట్ , ఓ బద్రి, ఓ అమ్మానాన్న తమిళ అమ్మాయి ..ఈ సినిమాలన్నీ తెరకెక్కించింది పూరి జగన్నాథ్ నే…

కాగా అప్పట్లో పూరి జగన్నాథ్ సినిమా తెరకెక్కిస్తున్నాడు అంటే థియేటర్స్ వద్ద జనాలు ఊగిపోయేవారు , యువత నాడిని పట్టుకొని ఆ టైప్ ఆఫ్ సినిమాలు తీసి జనాల్లో పిచ్చ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు . సీన్ కట్ చేస్తే ప్రజెంట్ పూరి పేరు చెప్తే సినిమా థియేటర్స్ కి రావడానికి భయపడిపోతున్నారు జనాలు . అంతలా తన పేరుని డి గ్రేట్ చేసుకున్నారు . మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ప్రమోషన్స్ లో పూరి చేసిన ఓవరాక్షన్ జనాలకి బాగా మండేలా చేసింది. దెబ్బకు సినిమాను డిజాస్టర్ గా మార్చేశారు. ఈ సినిమాకు పెట్టిన డబ్బులు ఎంత లాస్ అయ్యారో అందరికీ తెలిసిన విషయమే.

కాగా లైగర్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో పూరి జగన్నాథ్ తో తన మరో సినిమాను సైతం రద్దు చేసుకున్నాడు విజయ్ దేవరకొండ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . స్టార్ హీరో కూడా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్న రూమర్స్ ఎక్కువగా వినిపిస్తున్న టైం లో మెగాస్టార్ చిరంజీవి డేర్ చేసి ఆయనకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది . త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం అందుతుంది . ఎస్ మెగాస్టార్ చిరంజీవి పూరి జగన్నాధ్ ని నమ్మి ఓ అవకాశం ఇవ్వడానికి సిద్ధపడ్డాడట . దీంతో నెటిజన్స్ ఆయనను ట్రోల్ చేస్తున్నారు. లడ్డూ లాంటి ఆఫర్లు పట్టేసావ్ పూరి అంటూ కొందరు కామెంట్స్ పెడుతుంటే ..మరికొందరు రాంచరణ్ తో సైతం అవకాశం అందుకు అప్పుడు నీకు మరో లడ్డు దొరికినట్లే అంటూ అతని డైరెక్షన్ పై వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి పూరి-మెగాస్టార్ సినిమా పై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..?