`వీర సింహారెడ్డి`లో ఎన్టీఆర్‌.. ఆ పాత్ర‌లో చేసుంటేనా బాక్సాఫీస్ షేకే!

అఖండ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం నట‌సింహం నందమూరి బాలకృష్ణ నుంచి వచ్చిన చిత్తమే `వీర సింహారెడ్డి`. గోపిచంద్ మ‌లినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్య తండ్రీ,కొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేశాడు. శృతిహాసన్, హ‌ని రోజ్‌ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12 విడుదలై మిక్స్ టాక్ ను సొంతం చేసుకుంది.

అయితే టాక్ తో సంబంధం లేకుండా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. బ్రేక్ ఈవెన్ కు అతి చేరువ‌లో ఉన్న ఈ చిత్రం.. రెండు వారాలు కంప్లీట్ అయ్యే సమయానికి కచ్చితంగా క్లీన్ హిట్ గా నిలుస్తుందని సినీ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి నెట్టింట ప్ర‌స్తుతం ఓ చ‌ర్చ మొద‌లైంది. అదేంటంటే ఈ సినిమాలో బాలయ్య కొడుకు జై సింహా రెడ్డి పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తే బాగుండేదని నందమూరి అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

వీర సింహారెడ్డిగా బాలయ్య, జై సింహా రెడ్డి గా ఎన్టీఆర్ న‌టించి ఉంటే సినిమా రిజ‌ల్ట్ మ‌రోలా ఉండేదని.. బాక్సాఫీస్ ఓ రేంజ్ లో షేక్ అయ్యేద‌ని అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా, గతంలో ఎన్టీఆర్ నటించిన `జ‌న‌తా గ్యారేజ్‌` మూవీ రిలీజ్ అయిన సమయంలోనూ మోహన్ లాల్‌ పోషించిన పాత్రలో బాలయ్య న‌టించి ఉంటే బాగుండేద‌ని అనుకున్నాడు. ఇప్పుడు ఇదే మళ్లీ రిపీట్ అవుతుంది. మరి బాబాయ్‌, అబ్బాయి ఎప్పటికి స్క్రీన్ షేర్ చేసుకుని అభిమానుల‌ను ఆనందపరుస్తారో చూడాలి.