అక్కినేని అఖిల్‌పై మనసు పారేసుకున్న ఆ హీరోయిన్.. ఎందుకు పెళ్లి చేసుకున్నానా అంటూ..!!

అక్కినేని నాగార్జున వారసులలో అక్కినేని అఖిల్ ఒకరు. ‘అఖిల్’ అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అఖిల్ తన మొదటి సినిమాతోనే డిజాస్టర్ రుచి చూశాడు. ఆ తరువాత నటించిన ‘హలో’ మూవీ కూడా విజయం సాధించలేకపోయింది. ఇక గత ఏడాది అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అక్కినేని అఖిల్ సినిమాలు హిట్ అవుతున్నాయా ప్లాప్ అవుతున్నాయా అనేది పక్కన పెడితే, హీరోగా ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా మాత్రం బాగా ఫేమస్ అవుతున్నాడు.

అక్కినేని నాగార్జున అమ్మాయిల మనసులో మన్మథుడిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో అలానే అఖిల్ కూడా జూనియర్ మన్మథుడిగా అంతే పేరు తెచ్చుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఒక పెళ్లి అయిన హీరోయిన్ అఖిల్ ని ఎంతగానో ఇష్టపడుతుందట. అసలు ఆ హీరోయిన్ ఎవరా అని అనుకుంటున్నారా?.. అయితే ఆమె ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమవుతున్న డ్యాన్స్ షో ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ చివరి దశకి వచ్చేసింది. అయితే ఈ నెల 22న గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. ఆ గ్రాండ్ ఫినాలేకి అక్కినేని అఖిల్ చీఫ్ గెస్ట్‌గా హాజరువుతున్నట్లు సమాచారం. దీనికి సంబందించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ డ్యాన్స్ షోలో జడ్జిగా ఉన్న హీరోయిన్ ఆనంది, అఖిల్ ని చూడగానే ‘ఎందుకు నేను ఇంత తొందరగా పెళ్లి చేసుకున్నానా అని చాలా బాధపడుతున్నా.’ అని షోలో అందరిముందు అఖిల్ కి చెప్తుంది. ఆమె మాటలు విని అఖిల్ కూడా కాస్త సిగ్గుపడతాడు.

ఆ డ్యాన్స్ షోలో ఉన్న జబర్దస్త్ కమెడియన్ రోహిణి అఖిల్ ని చూసి అయ్యగారే నంబర్‌ వన్ అని ఒక డైలాగ్ చెప్తుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ డాన్స్ ఇండియా డాన్స్ షో ని మరింత పాపులర్ చెందుతుంది. అంతేకాకుండా అఖిల్ ని చూసిన వెంటనే తనని తను మరిచిపోయిన పెళ్లి అయిన ఆనందిని చూసి కొంతమంది రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.