అయ్యయ్యో… బాలకృష్ణకు మళ్ళీ దెబ్బేసిన నాగార్జున..ఈసారి మామూలుగా లేదుగా..!

సినిమా పరిశ్రమ అన్నాక చాలా మంది నటీనటుల మధ్య మంచి అనుబంధాలు ఉంటాయి.. వారిలో మరి కొంతమంది మధ్య గొడవలు పెరిగీ దూరమవుతూ ఉంటారు. ఇక అది మరీ ముఖ్యంగా సినిమాల వల్ల కావచ్చు లేదంటే వారి వ్యక్తిగత విషయాల వల్ల కూడా అవ్వచ్చు. అయితే సినిమా పరిశ్రమలో మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నాగార్జున- బాలకృష్ణల మధ్య ఉన్న గ్యాప్. అవును ఈ ఇద్దరు సీనియర్ హీరోల మధ్య ఎంతో దూరం ఉందని ఎన్నోసార్లు రుజువు అయింది.

Balakrishna- Nagarjuna:'అన్ స్టాపబుల్'కు రాలేను..ఎందుకంటే..: బాలయ్యకు షాక్  ఇచ్చిన నాగ్.. - OK Telugu

ఇక వీళ్ళ దూరం పెరిగి దాదాపు పది సంవత్సరాలు పైన అవుతుందట.ఇదో సినిమా ఫంక్షన్ లో ఎదురుపడితె కనీసం ఒక నవ్వు నవ్వి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోరుట. అయితే వీరి మధ్య ఎంత దూరం పెరగడానికి కారణాలైతే చాలానే ఉన్నాయి. కానీ అవేవీ అంత పెద్దవి కాకపోవచ్చు అని వీరి స్నేహితులు భావిస్తున్నారట. ఒకానొక టైంలో అక్కినేని నాగేశ్వరరావు చనిపోతే బాలకృష్ణ వచ్చారు. కానీ తన తండ్రి జ్ఞాపకార్థం నాగార్జున ఒక సభ పెట్టినప్పుడు ఇండస్ట్రీలో ఉన్న అందరిని పిలిచారట కానీ బాలకృష్ణ ని మాత్రం పిలవలేదట.

ఇవే కాకుండా ఇంకా ఎన్నో సందర్భాలలో వీరి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఇక ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ హోస్ట్ గా బాలకృష్ణ చేయాలంటే బిగ్ బాస్ సెట్ అన్నపూర్ణ స్టూడియోలో ఉండకూడదు అని ఒక కండిషన్ పెట్టారంటూ కొన్ని రూమ‌ర్‌లు వినిపించాయి. అయితే బాలకృష్ణ నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమా షూటింగ్ కొంత భాగం అన్నపూర్ణ స్టూడియోలోనే జరిగింది. బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న ఆన్ స్టాపబుల్ షో షూటింగ్ కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే జరుగుతుంది. అయితే ఈ షో కి నాగార్జున అని మాత్రం బాలకృష్ణ ఆహ్వానించట్లేదు.

ఇక ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్న వివాదాలు మరోసారి బయటపడ్డాయి.అయితే ఇప్పుడు తాజాగా బాలకృష్ణ మీద ఉన్న కోపాన్ని నాగార్జున మరోసారి బయట పెట్టారట అదేమిటంటే వాల్తేరు వేరయ్య- వీర సింహారెడ్డి సినిమాలు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలకు థియేటర్ల విషయంలో బాలయ్య సినిమాకు ఎక్కువ వచ్చాయని, చిరు సినిమాకి థియేటర్లు తక్కువ దొరికినట్టు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

Nagarjuna

ఈ క్రమంలోనే నాగార్జున రంగంలోకి దిగి తన అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ద్వారా తనకు మంచి పట్టు ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాలో చిరంజీవి నటించిన వీరయ్య సినిమాకి ఎక్కువ థియేటర్లు వచ్చేలా వెనక నుండిచి ఎక్కువ థియేటర్లో వచ్చేలా మంతనాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజముందో ఎవరికి తెలియదు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.