లోకేష్ పాదయాత్ర షురూ..టీడీపీకి అధికారం దక్కుతుందా!

నారా లోకేష్ పాదయాత్ర మొదలవుతుంది..మరి కొన్ని గంటల్లో కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర మొదలవుతుంది. అయితే అనేక ఆంక్షల మధ్య లోకేష్ పాదయాత్ర ప్రారంభవుతుంది. అయితే ఈ ఆంక్షల్లో సడలింపులు దొరుకుతాయా? లేక అవేమీ పట్టించుకోకుండా పాదయాత్ర ముందుకెళుతుందా? అనేది చూడాల్సి ఉంది. ఆ విషయం పక్కన పెడితే..పాదయాత్ర ద్వారా టీడీపీని అధికారంలోకి తీసుకు రాగలరా లేదా? అనేది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది.

గత ఎన్నికల్లో దారుణంగా ఓడి ప్రతిపక్షానికి పరిమితమైన పార్టీని కొంతమేర చంద్రబాబు పికప్ అయ్యేలా చేశారు. తనకు సాధ్యమైన మేర పార్టీ బలం పెంచారు. అయితే ఇంకా వైసీపీకి చెక్ పెట్టాలంటే టీడీపీ బలం ఇంకా పెరగాలి. అందుకే ఇప్పుడు అందరి చూపు లోకేష్ పాదయాత్రపై ఉంది. పాదయాత్ర ద్వారా టి‌డి‌పిని ఎంతవరకు అధికారంలోకి తీసుకువస్తారనేది ప్రశ్నగా ఉంది. అయితే లోకేష్ పాదయాత్రపై టి‌డి‌పి శ్రేణులు చాలా అంచనాలు పెట్టుకున్నాయి. ఖచ్చితంగా లోకేష్ పాదయాత్ర టి‌డి‌పికి ప్లస్ అవుతుందని, పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి సాయపడుతుందని అంటున్నారు.

అదే సమయంలో ఓ పర్ఫెక్ట్ నాయకుడుగా ఎదగడానికి పాదయాత్ర..లోకేష్‌కు హెల్ప్ అవుతుందని అంటున్నారు. గత ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగి ఓటమి పాలైన లోకేష్‌ని వైసీపీ ఏ స్థాయిలో ఎగతాళి చేస్తూ వచ్చిందో తెలిసిందే. అయితే ఎగతాళి చేసిన వారి నోరు మూయించి..లోకేష్ ఓ మంచి నాయకుడు అవుతాడని టి‌డి‌పి శ్రేణులు భావిస్తున్నాయి. అంటే ఇప్పుడు పాదయాత్ర పార్టీతో పాటు లోకేష్ రాజకీయ జీవితానికి హెల్ప్ అవుతుందని అంటున్నారు.

అయితే పాదయాత్రని వైసీపీ…సజావుగా సాగనివ్వదనే అనుమానాలు ఉన్నాయని టి‌డి‌పి కార్యకర్తలు అంటున్నారు. ఏదో రకంగా పాదయాత్రకు బ్రేకులు వేయడానికే చూస్తారని, అవన్నీ దాటుకుని లోకేష్ సక్సెస్ అవుతారని అంటున్నారు. చూడాలి మరి లోకేష్ పాదయాత్ర ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో.