సంక్రాంతికి మరో 15 రోజులు టైమ్ ఉండగానే టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల హడావుడి ఇప్పటికే మొదలైంది. ఈ సంక్రాంతికి టాలీవుడ్ అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ముందుగా బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో జనవరి 12న థియేటర్లో దిగుతున్నాడు. ఈ సినిమా విడుదలైన తర్వాత రోజు జనవరి 13న వాల్తేరు వీరయ్య సినిమాతో చిరు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ రెండు సినిమాలు కూడా 24 గంటల వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ లో కలెక్షన్ సాధిస్తాయనే చర్చ కూడా ఇప్పటికే మొదలైంది. ఇప్పటికే ఈ రెండు సినిమాల నుంచి బయటికి వచ్చిన టీజర్, సాంగ్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక మొన్న వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ‘మెగా పూనకాలు’ అనే సాంగ్ కూడా వచ్చింది. ఇక నిన్న వీర సింహారెడ్డి సినిమా నుంచి ‘రోరింగ్ ఆఫ్ వీర సింహారెడ్డి’ అనే పేరుతో వచ్చిన మేకింగ్ వీడియో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇక ఇప్పుడు ఈ రెండు సినిమాలు కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అప్డేట్ ఏమిటంటే బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలో ఇంటర్వెల్ బ్యాక్ లో వచ్చే ‘కుర్చీ ఫైట్’ ఎంతో హైలెట్గా ఉండబోతుందట.. ఆ ఫైట్ లో బాలకృష్ణ మొత్తం కుర్చీలో కూర్చునే ఉంటాడట.. ఇక ఈ ఫైట్ ను ఫైట్ మాస్టర్స్ అయిన రామ్- లక్ష్మణ్ ఎంతో స్టైలిష్ గా డిజైన్ చేశారట. ఈ ఫైట్ సినిమాలోనే ఎంతో హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.
చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఓ ‘గన్ ఫైట్’ హైలెట్ కానందుట ఈ ఫైట్ ని కూడా ఫైట్ మాస్టర్ రామ్- లక్ష్మణ్ ఎంతో స్టైలిష్ గా డిజైన్ చేశారట. ఈ ఫైట్ చిరంజీవి పాత సినిమాలుకు భిన్నంగా ఎంతో స్టైలిష్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇలాంటి స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలతో వస్తున్న ఈ రెండు సినిమాలు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో చూడాలి.