2023లో అయినా హిట్ కొట్టాలన్న కసితో చిరు, ప్రభాస్, దేవరకొండ భారీ ప్లాన్!

కరోనా తరువాత కూడా పుంజుకున్న తెలుగు పరిశ్రమకు పెద్ద హీరోల రూపంలో మాత్రం షాకుల మీద షాకులు తగిలాయి. అవును, కరోనా విపత్తు తరువాత యావత్ ఇండియన్ సినిమా పరిశ్రమ కుదేలు అయింది. కానీ తెలుగు పరిశ్రమ మాత్రం వరుస హిట్లు మీద హిట్లు ఇస్తూ సత్తా చాటింది. అయితే కొంతమంది బడా హీరోలకు మాత్రం సక్సెస్ ముఖం చాటేసింది. ఈ క్రమంలో ఎన్నో అంచనాలను పెట్టుకొని రిలీజైన సినిమాలు సూపర్ ప్లాప్ గా నిలిచి భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. దాంతో సో కాల్డ్ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

దాంతో మన హీరోలు 2023లో అయినా సాలిడ్ హిట్ కొట్టాలనే కసితో పని చేస్తున్నారు. అందులో మొదటి వారు.. మనందరివాడు మెగాస్టార్ చిరంజీవి. అవును, 2022 చిరు అభిమానులకి బిగ్ డిస్సప్పాయింట్మెంట్. ఆచార్య చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో అభిమానులే కాకుండా మెగా ఫ్యామిలీ కూడా బాధపడింది. అది చాలదన్నట్టు ఆచార్య తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్ మూవీ కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. కాగా ఇపుడు చిరంజీవి తాజా చిత్రం వాల్తేరు వీరయ్య మీదే ఆశలు పెట్టుకొని వున్నాడు.

 

ఆ తరువాత మాట్లాడుకోవలసింది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. అవును, బాహుబలి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ యంగ్ రెబల్ స్టార్ కి దక్కలేదు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. దాంతో ఇపుడు ప్రభాస్ ఆశలన్నీ ఆదిపురుష్, సలార్ చిత్రాల మీదే వున్నాయి. ఆ తరువాత విజయ్ దేవరకొండ గురించి చెప్పుకోవాలి. మంచి ఊపుమీద వున్న కొండబాబుకి భారీ అంచనాలతో రిలీజైన లైగర్ చిత్రం దారుణమైన అనుభవాలను మిగిల్చింది. అంతేకాకుండా ఈ చిత్రంతో విజయ్ విమర్శలపాలయ్యాడు కూడా. కాగా విజయ్ ఇపుడు ఎలాగన్నా ఖుషి సినిమాతో హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.