నటసింహ నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నటిస్తున్న సినిమా వీర సింహారెడ్డి. క్రాక్ లాంటి సూపర్ హిట్ తో ఫుల్ క్రేజ్ లో ఉన్న గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా నిన్నటితో కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా రిలీజ్ టైమ్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లు కూడా చాలా జోరుగా చేస్తున్నాయి. ఈ సినిమా నుంచి మూడు పాటలు రిలీజ్ చేయగా.. వాటికి అభిమానుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజా అప్డేట్ ఏంటంటే ఈ సినిమా ప్రమోషన్లో బాలకృష్ణ కూడా జాయిన్ అవ్వబోతున్నారట.
జనవరి ఫస్ట్ వీక్ నుంచి జరిగే ఈ సినిమా ప్రమోషన్లలో బాలకృష్ణ కూడా స్పెషల్ అట్రాక్షన్ ఇవ్వబోతున్నాడట. అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6న ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోల్లో భారీ స్థాయిలో ప్లాన్ చేయబోతున్నారు. వీటితో పాటు పలు ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్స్ లో కూడా బాలకృష్ణ జాయిన్ అవ్వబోతున్నాడు.
ఈ సినిమాలో బాలకృష్ణకు జంటగా అందాల భామ శృతిహాసన్ నటించింది. ఈ సినిమాకు బాలకృష్ణ అఖండ సినిమాకు మ్యూజిక్ అందించిన థమన్ సంగీతం అందిస్తున్నాడు. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.