`వార‌సుడు`ను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఎవ‌రో తెలుసా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ద‌ళ‌పతి, టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిపల్లి కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వ‌రిసు(తెలుగులో వార‌సుడు)`. విజయ్ 66వ మూవీగా ప్రేక్షకుల ముందుకు రావోతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇందులో నేషనల్ క్రష్‌ రష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టించింది. వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్న మేక‌ర్స్‌.. ప్ర‌మోష‌న్స్ కు సైతం రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైర‌ల్ గా మారింది.

అదేంటంటే.. ఈ సినిమాకు ఫ‌స్ట్ ఛాయిస్ విజ‌య్ ద‌ళ‌ప‌తి కాద‌ట‌. టాలీవుడ్ కు చెందిక ఇద్ద‌రు స్టార్ హీరోలు ఈ చిత్రాన్ని మిస్ చేసుకున్నార‌ట‌. అవును, వంశీ పైడిపల్లి మొదట ఈ కథను మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు. అయితే అప్పటికే మహేష్‌ వేరే సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ ఒకే కాలేదు. ఆ తర్వాత రామ్ చరణ్‌ అయితే బాగుంటుందని అనుకోగా.. ఆయ‌న `ఆర్సీ 15` డిస్కషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఫైన‌ల్‌గా వారసుడు సినిమా కథ విజయ్ ద‌గ్గ‌ర‌కు దగ్గరికెళ్లి ఫైనల్‌ అయింది.