తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శక ధీరుడుగా ఎన్నో వైవిధ్యమైన సినిమాలు తీసి ప్రపంచ గర్వించదగ్గ దర్శకుడిగా మారిన రాజమౌళి.. అయితే ఇప్పుడు ఆయన కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు, విభేదాలు వచ్చినట్టు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఓ టాక్ నడుస్తుంది. ఇప్పుడు ఈ విషయాలపై రాజమౌళి చెల్లెలు ఎంఎం శ్రీలేఖ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది.
ఈమె కూడా టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా సింగర్ గా, ఫిలిం కంపోజర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకుంది ఎం ఎం శ్రీలేఖ. సింగర్ గా తన కెరియర్ మొదలుపెట్టి మ్యూజిక్ డైరెక్టర్గా టాలీవుడ్ లో స్థిరపడింది శ్రీలేఖ. ఈమె టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి సొంత చెల్లెలు. దర్శక ధీరుడు రాజమౌళికి కూడా ఈమె వరుసకు చెల్లులే అవుతుంది. ఇక ఇద్దరి కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉండడంతో ఈమె రాజమౌళిని కూడా తన సొంత అన్నయ్య లాగానేే భావిస్తారట.
అయితే ఇక రాజమౌళి సహకారంతోనే శ్రీలేఖ చిత్ర పరిశ్రమంలో ఇన్ని అవకాశాలు దక్కించుకుంటుందినే ఓ టాక్ కూడా నడుస్తుంది. ఈమె టాలీవుడ్ లో ఇప్పటివరకు 80 సినిమాలకు పైగా మ్యూజిక్ అందించారు.తాజాగా అడివి శేష్ హీరోగా వచ్చిన హిట్ 2 సినిమాలో కూడా ఈమె ఓ పాటకు మ్యూజిక్ కంపోస్ చేశారు. అయితే ఈమెకు ఆ సినిమాలలో అవకాశం రావడానికి రాజమౌళినే కారణమని ఆయనే నానిని రికమండేషన్ చేసి ఈమెకు ఛాన్స్ ఇప్పిచ్చారని తెలుస్తుంది.
రాజమౌళి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన ఆయన సినిమాలకు మాత్రం తన చెల్లి శ్రీలేఖకు మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం ఇవ్వలేదు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అందుకే రాజమౌళి ఈమెకు మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం ఇవ్వలేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలేఖ ఈ విషయాల గురించి మాట్లాడుతూ రాజమౌళి కీరవాణి అన్నయ్య మధ్య చాలా గట్టి బాండింగ్ ఉంది. అందుకే రాజమౌళి అన్నయ్య తన సినిమాలు కు కీరవాణిని మాత్రమే ఎంపిక చేసుకుంటారు. రాజమౌళి అన్నకి ఎప్పుడు ఎవరినిఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలుసు. భవిష్యత్తులో తన సినిమాలలో నాకు కూడా అవకాశం కల్పిస్తారేమో అని సమాధానం ఇచ్చింది. రాజమౌళి కుటుంబంతో మాకు ఎటువంటి విభేదాలు లేవని శ్రీలేఖ క్లారిటీ ఇచ్చింది.