బుద్దొచ్చింది..ఇక పై వాళ్లకి దూరంగా ఉంటా.. రష్మిక మందన్నా షాకింగ్ డెసీషన్..!!

పాపం .. 2022లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. అనుకోని వివాదాల్లో ఇరుక్కుని తన కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టుకునే స్థాయికి దిగజారిపోయింది . సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో రష్మిక మందన్నాని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రష్మిక పోస్ట్ పెట్టినా తలనొప్పి.. పెట్టకపోయినా తలనొప్పి.. పెడితే ఓ విధంగా ట్రోల్ చేస్తారు.. పెట్టకపోతే భయపడింది అంటూ ట్రోల్ చేస్తారు .

పాపం ఈ తలనొప్పులు భరించలేక రష్మిక మందన్నా ఏకంగా సోషల్ మీడియా కి గుడ్ బై చెప్పేసే విధంగా నిర్ణయం తీసుకుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మొదటి నుంచి అందరూ నా వాళ్ళు అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి అంటూ చెప్పకు వచ్చిన రష్మిక మందన్నా.. పై సోషల్ మీడియాలో కనిపించకుండా ఉండడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది . మరీ ముఖ్యంగా కాంతారా డైరెక్టర్ రిషిబ్ శెట్టితో వివాదం మరింత ముదిరిపోవడంతో రష్మిక మందన పేరుని ఒకటికి నాలుగు రకాలుగా వాడుతూ ట్రోల్ చేస్తున్నారట .

ఈ క్రమంలోనే ఆమె కుటుంబ సభ్యులు సైతం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని సినిమా ఇండస్ట్రీని వదిలేయమని చెప్తున్నారు అని రష్మిక ఫ్రెండ్స్ వద్ద చెప్పుకొని బాధపడిందట. అందుకే ఇలాంటి జనాలకు దూరంగా ఉండడానికి రష్మిక మందన సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేయాలని నిర్ణయించుకుందట. న్యూ ఇయర్ సందర్భంగా రష్మిక మందన ఈ న్యూస్ ని అఫీషియల్ గా ప్రకటించడం నుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఏది ఏమైనా సరే రష్మిక మందన్నా తీసుకున్న నిర్ణయం మంచిదే అంటున్నా మరి కొంతమంది సోషల్ మీడియాకి కాదు నువ్వు సినిమాలు కి గుడ్ బాయ్ చెప్పేయ్ జీవితం బాగుపడుతుంది అంటూ కొందరు వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు.