తప్పంతా ఆడవాళ్ళదేనా..? మగాళ్ళు నంగ లా..? అడిగి కడిగేసిన స్టార్ హీరోయిన్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్స్ వరుసగా ట్రోలింగ్ కి గురవుతున్నారు. మరి ముఖ్యంగా బిగ్ బిగ్ బడా హీరోయిన్స్ అందరూ ఇలా దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం షాకింగ్ గా ఉంది అంటూ వాళ్ళ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోని కన్నడ నటి లోక్ సభ మాజీ ఎంపీ రమ్య కూడా తనదైన స్టైల్ లో స్పందించి ట్రోలర్స్ కు ఘాటుగా జవాబు ఇచ్చింది. మనకు తెలిసిందే ప్రజెంట్ దీపిక పదుకొనే సోషల్ మీడియాలో ఏ రేంజ్ ట్రోలింగ్ కి గురవుతుందో .

బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్- దీపిక కలిసి నటిస్తున్న చిత్రం పఠాన్ . ఈ మూవీ లోని ఓ పాట దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది . దీపిక పదుకొనే ఈ సాంగ్లో వేసుకున్న డ్రెస్ గురించి డాన్స్ చేసిన పద్ధతి గురించి ఎక్స్పోజింగ్ గురించి పొలిటీషియన్స్ సైతం ఘాటుగా స్పందిస్తున్నారు . అంతేకాదు పెళ్లయిన నువ్వు ఇలా బరితెగించి నటించడానికి సిగ్గు లేదా అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు . ఈ క్రమంలోనే మాజీ ఎంపీ రమ్య ఘాటుగా జవాబు ఇచ్చింది .

ఆమె ట్వీట్ చేస్తూ..” సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో అమ్మాయిలను ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు . తప్పు ఎవరిదో తెలుసుకోకుండానే లేడీస్ అనగానే టార్గెట్ చేస్తున్నారు . ఆ మధ్య సమంతను ట్రోల్ చేశారు . చైతన్యతో విడాకులు తీసుకుందని తప్పంతా తనదే అంటూ నిందలు వేశారు. ఆ తర్వాత సాయి పల్లవి ఏదో మాట్లాడింది అంటూ ఆమె సినీ కెరియర్ ని నాశనం చేశారు. ఇక తర్వాత రష్మిక మందన్నాను పాయింట్ అవుట్ చేస్తున్నారు .

ఇప్పుడు దీపికా పదుకొనే పొట్టి దుస్తులు ధరించింది అంటూ ఆమెనే టార్గెట్ చేస్తున్నారు. ఇలా వరుసగా అందరూ హీరోయిన్స్ ని టార్గెట్ చేస్తున్నారు “అంటూ ఆమె మండిపడింది. పొట్టి డృఎస్ ధరించడం తప్పా..? అంటూ ప్రశ్నించింది . అయితే ఇదే క్రమంలో పలువురు మహిళలలు సైతం సోషల్ మీడియాలో ఆడవాళ్ళపై వస్తున్న వల్గర్ కామెంట్స్ పై మండిపడుతున్నారు. అన్ని తప్పులు ఆడవాళ్ళే చేస్తారా..? మగవాళ్ళంతా నంగ లా..? ఆ విషయం కామెంట్ చేసే మగవాళ్ళకి తెలియదా..? అంటూ ఫైర్ అవుతున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.