పీకల్లోతు ప్రేమ‌లో మునిగిన తరుణ్-ఆర్తి అగర్వాల్ ఎందుకు విడిపోయారు?

హీరో తరుణ్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి లవర్ బాయ్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. తరుణ్ 2000వ సంవత్సరంలో `నువ్వే కావాలి` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు. `నువ్వే నువ్వే`, `నువ్వు లేక నేను లేను` వంటి పలు సూపర్ హిట్ సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తరువాత చేసిన సినిమాలు ఏవి కూడా పెద్దగా ఆడలేదు.

ఇదిలా ఉంటే అప్పట్లో దివంగత నటి ఆర్తి అగర్వాల్ తో తరుణ్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారంటూ కొన్ని వార్తలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్లో `నువ్వు లేక నేను లేను`, `సఖియా` సినిమాలు వచ్చాయి. అయితే వీరిద్దరూ మొదటి సినిమాతోనే ప్రేమలో పడ్డారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి.

ఈ విషయంపై ఇమ్మంది రామారావు స్పందిస్తూ.. ఆర్తి అగర్వాల్ తరుణ్ ని పీకల్లోతు ప్రేమించిందని.. ఒకానొక సందర్భంలో చెల్లితో, తరుణ్ తో ఆర్తి కలిసి రెస్టారెంట్ కి వెళ్తే అక్కడ చెల్లి తరుణ్ తో క్లోజ్ గా మూవ్ అవడం చూసి చెల్లితో గొడవ పడిందని వార్తలు అప్పట్లో బాగా వినిపించాయి. కానీ తరుణ్ వాళ్ళమ్మ రోజా రమణి వాదన మాత్రం మరొకలా ఉంది అని ఇమ్మంది తెలిపారు. తరుణ్ హీరోయిన్ల అందరితోనూ కలివిడిగా ఉంటాడని.. వారు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్లేవారని.. ఆమాత్రానికే ప్రేమ అంటూ పుకార్లు లేపుతున్నారని.. అంతేగాని తరుణ్ ఎవరిని ప్రేమించలేదని వారి తల్లి రోజా రమణి తెలిపారు.

ఆ తరువాత ఆర్తి అగర్వాల్ సినిమా కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడే ఆమె తండ్రి ఒత్తిడి తీసుకురావడంతో పెళ్లి చేసుకోవడం జరిగింది.కానీ ఆ బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. విడాకులు తీసుకుని మళ్లీ సినిమా కెరీర్ ని ప్రారంభించాలని అనుకుంది ఆర్తి అగర్వాల్.

ఆ తరువాత సర్జరీ చేయించుకుని అది వికటించడంతో ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. అలా పీకల్లోతు ప్రేమించుకున్న తరుణ్-ఆర్తి అగర్వాల్ విడిపోయారంటూ.. ఇక ఆ తరువాత తరుణ్ కి కూడా అవకాశాలు తగ్గిపోయాయని ఇమ్మంది రామారావు అభిప్రాయపడ్డారు.