బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యువ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదిపేసింది. అయితే ఈయన ఆత్మహత్య చేసుకున్న విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే సుశాంత్ సింగ్ రాజు పుత్ మరణించి ఎన్ని రోజులు అవుతున్నా.. ఆ మిస్టరీ మాత్రం వీడలేదు.. కేసులో ఆయన ఎందుకు మరణించాడు.. అన్న విషయం మాత్రం తేలలేదు. ఇక ఎంతో విచారణ జరిగినా కూడా అసలు బయటపడలేదు. అవకాశాలు దక్కక చనిపోయాడా? ఎవరైనా తొక్కేశారా? లేక ఎవరితోనైనా మోసపోయాడా? అని చాలా రకాల కోణాలలో కూడా పోలీసులు ఆరా తీశారు .కానీ అసలు విషయం మాత్రం బయటకు రావడం లేదు.
ఇదిలా ఉండగా తాజాగా ప్రముఖ టీవీ నటి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితురాలు అయిన వైశాలి ఠక్కర్ తాజాగా ఆత్మహత్య చేసుకోవడం టీవీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. చాలా హిందీ సీరియల్స్ లో నటించిన వైశాలి గత ఏడాదికాలంగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఉంటోంది .అయితే ఇటీవల తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక వైశాలి ఠక్కర్ నివాసం నుంచి పోలీసులు సూసైడ్ నోట్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రేమ వ్యవహారమే 30 ఏళ్ల వైశాలి ఠక్కర్ ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు.
వైశాలి ఠక్కర్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి మంచి స్నేహితురాలు.. అతడి మరణం పై అప్పట్లో ఆమె అనుమానాలు వ్యక్తం చేసింది . సుశాంత్ ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని, సుశాంత్ ను హత్య చేశారు అని, అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి తో పాటు మరికొందరి ప్రమేయం కూడా ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసింది. అయితే అప్పట్లో ఇది పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆమె మరణం కూడా టీవీ ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది.