ఆఫ‌ర్లు లేక ఆ ప‌నికి సిద్ధ‌మైన `అర్జున్ రెడ్డి` భామ‌..క్రేజీ న్యూస్ వైర‌ల్‌?!

టాలీవుడ్ లో సెన్సేషనల్ క్రియేట్ చేసిన `అర్జున్ రెడ్డి` సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది షాలినీ పాండే. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తో పాటు షాలిని పాండే కూడా బోల్డ్ యాక్టింగ్ తో ఇండస్ట్రీలో రచ్చ రచ్చ చేసింది. ఇక మొదటి సినిమాతోనే అందరి మతులు పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ. అలాగే మొదటి సినిమానే హిట్ కొట్టడంతో షాలినీ పాండేకు ఆఫ‌ర్లు వెల్లువెత్తాయి.

ఈ క్ర‌మంలోనే తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో న‌టించింది. కానీ, ఎక్క‌డా స‌క్సెస్ కాలేక‌పోయింది. కథలు సెలెక్ట్ చేసుకోవడంలో షాలిని పాండే అనేక తప్పులు చేసి పరాజయాలను మూటగట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ భామ గ్లామరస్ పాత్రలు చేయడానికి కూడా రెడీగా ఉన్నా ఈమెను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు.

సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షోట్ల‌తో అరాచ‌కం సృష్టిస్తోంది. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవకాశాలు మాత్రం రావడం లేదు. ఆఫ‌ర్ల లేక ఈ భామ ఇప్పుడు ఐటెం సాంగ్ చేసేందుకు సిద్ధ‌మైందట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ `ఖుషి`.

శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 17న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే ఈ చిత్రంలో ఓ ఐటెం ఉంటుంద‌ట‌. ఆ ఐటమ్ సాంగ్ కోసం షాలిని పాండేను టీం అప్రోచ్ అవ్వ‌గా.. ఆమె వెంట‌నే ఒకే చెప్పేసింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు, ఈ సాంగ్ లో మాత్రం వీళ్ళిద్దరూ ఊర మాస్ స్టెప్పులతో రెచ్చిపోనున్నట్లు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. మరి ఈ ప్ర‌చారంలో ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రావాల్సిందే.