ఆ భయంతోనే.. కృతి కొంగు తీసుకోని ప్రభాస్..వెర్రీ గుడ్ బాయ్..!

బాహుబలి సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేసే సినిమాల్లో అందరి చూపు ఆదిపురుష్ సినిమా పైనే ఉంది. సినిమా టీజర్ అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అయోధ్యలో విడుదల చేశారు. ఈ టీజర్ విడుదల చేసే సమయంలో ఆ వేదికపై ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రామాయణం కథాంశంగా పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో తెరకెక్కించాడు.

ఈ సినిమాలో రాముడు గా ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్ నటించింది. అయితే ఈ టీజర్ విడుదల వేదికపై ప్రభాస్- కృతి మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ ఆ వేదికపై తీవ్ర వేడితో ఉక్కపోతకు గురయ్యాడు. ఆ వేడికి ప్రభాస్ నుదుటన విపరీతంగా చెమటలు పట్టేసాయి. ప్రభాస్ దీంతో తన చేతితోనే ఆ చెమటను తుడుచుకున్నాడు. అది చూసిన కృతి తన చీర కొంగు ఇచ్చి చెమటను తురుచుకోమనగా ప్రభాస్ వద్దని తన చేత్తోనే చెమటను తుడుచుకున్నాడు.

Kriti Sanon glows in regal lehenga at Adipurush teaser launch in Ayodhya. Pics here - Lifestyle News

ఈ ఆసక్తికర సంఘటన అక్కడ ఉన్న కెమెరాలకు చిక్కింది. ఇప్పుడు ఈ వీడియో బయటకి రావడంతో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందంటూ బాలీవుడ్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. ప్రభాస్- కృతి కొంగు కావాలనే తీసుకోలేదు.. ఆయన గుడ్ బాయ్ అంటూ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా కామెంట్లు చేస్తున్నారు. ఆదిపురుష్‌ సినిమా టీజర్ కు మంచి స్పందన వస్తుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వస్తుంది.