టాలీవుడ్ స్టార్ హీరోతో ఎంఎస్ ధోని సినిమా.. త్వ‌ర‌లోనే బిగ్ అనౌన్స్‌మెంట్?!

మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియా మాజీ కెప్టెన్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ రథసారథి సరికొత్త సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ధోని ఫిలిమ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారనే వార్త దక్షిణాది మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే గతంలో ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన ధోని తాజాగా ఓ కొత్త ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టాడు.

దీపావళి సందర్భంగా ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కింద తమిళంలో మొదటి సినిమాను నిర్మించబోతున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే ధోని ప్రొడక్షన్ హౌస్ కు అతని భార్య సాక్షి సింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ధోని రాసిన `అథర్వ-ది హరిజిన్` అనే న్యూ ఏజ్ గ్రాఫిక్ నవల ఆధారంగా తన మొదటి సినిమా తెర‌కెక్కిస్తున్నట్టు.. ఈ సినిమాకు రమేష్ తమిళమణి డైరెక్ట్ చేయబోతున్నాడు అంటూ ధోని తెలిపారు.

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న ధోనీకి తమిళంలో ఫుల్ మాస్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ముందు తమిళంలో సినిమా తీస్తున్నట్టు అలాగే తరువాత తెలుగు, మలయాళం లో కూడా సినిమా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే తెలుగులో మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ధోని మొదటి సినిమా ఉంటుందంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

అయితే తెలుగులో సినిమా తీస్తే అది సూపర్ స్టార్ మహేష్ బాబు తోనే తీయాలని ధోని డిసైడ్ అయ్యాడని.. దీనికోసం ఇప్పటికే మహేష్ బాబుని సంప్రదించారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే ధోని సినిమాకు సంబంధించిన వార్త అధికారికంగా అనౌన్స్మెంట్ చేయనున్నట్టు సమాచారం.