తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తన భార్య నమ్రత గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ముఖ్యంగా నమ్రత కూడా గతంలో ఎన్నో సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. కానీ మహేష్ బాబుతో వివాహమైన తర్వాత దూరంగా ఉంటూ కేవలం కుటుంబ, మహేష్ బాబు వ్యక్తిగత విషయాలను చూసుకుంటూ బిజీగా ఉన్నది. నమ్రత అక్క శిల్పా శిరోద్కర్ కూడా హీరోయిన్ అన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు.వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
1980 లో బాలీవుడ్ నటి రత అగ్నిహోత్రి ఎన్టీ రామారావు తో కలిసి కలియుగ కృష్ణుడు ఏఎన్ఆర్ తో కలిసి సత్యం శివం, చిరంజీవితో పున్నమినాగు వంటి సినిమాలలో నటించింది. కృష్ణ హీరోగా నటించిన సింహాసనం సినిమాలో బాలీవుడ్ నటి మందాకిని కూడా నటించడం జరిగింది. ఇక వెంకటేష్ నటించిన మొదటి చిత్రం కలియుగ పాండవులలో కూడా ముంబై నటి కుష్బూ హీరోయిన్గా నటించింది. ఇక చిరంజీవి నటించిన ఘరానా మొగుడు చిత్రంలో కూడా హిందీ నటి నగ్మా హీరోయిన్గా నటించింది. ఇలా ఎంతోమంది హీరోయిన్లు ఎక్కువగా బాలీవుడ్ నుంచి ఎంట్రీ ఇచ్చేవారు.
1992లో వచ్చిన శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్ బ్యానర్ పై డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా శిల్పా శిరోద్కర్ నటించిన చిత్రం బ్రహ్మ అనే చిత్రంలో నటించింది. నమ్రత అక్క శిల్పా శిరోద్కరి. మహేష్ బాబు నమ్రత ని వివాహం చేసుకోవడం వల్ల.. మహేష్ బాబుకు శిల్ప శిరోద్కరి వదిన అవుతుంది. శిల్పా శిరోద్కర్ ఆ తర్వాత ఈమె ఏ సినిమాలో కూడా నటించలేదు.