ఎవడి దూల వాడిది.. మ‌నోజ్ రెండో పెళ్లిపై మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్‌!

ఇటీవల మంచు మనోజ్ కి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మనోజ్ రెండో పెళ్లి త్వరలోనే చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మంచు మనోజ్ హైదరాబాద్కు చెందిన ప్రణతి రెడ్డిని 2015 వివాహం చేసుకుని నాలుగేళ్ల తర్వాత వ్యక్తిగత కారణాలవల్ల పరస్పర అంగీకారంతో మంచు మనోజ్ ఆమెతో 2019లో విడాకులు తీసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా నగరంలో ఓ వినాయక మండపంలో భూమా మౌనిక తో కలిసి మనోజ్ కనిపించడం మరియు వీరిద్దరూ క్లోజ్ గా ఉండటం చూసి త్వరలోనే వీరిరువురు పెండ్లిపీఠలు ఎక్క‌బోతున్నారంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మంచు మనోజ్ రెండో పెళ్లి విషయంపై మంచు లక్ష్మి స్పందించిన తీరు జనాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఓ రిపోర్టర్ మీ తమ్ముడు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడట.. నిజమేనా? అని మంచు లక్ష్మి అని ప్రశ్నించగా.. మంచు లక్ష్మి స్పందిస్తూ మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటుంటే.. నేనేమంటానండి బాబు.. ఎవడి దూల వాడిది.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అందులో భాగంగానే ఎవరి బ్రతుకు వాళ్లని బతకనీయండి.. హానెస్ట్ లవ్ ని నేనెప్పుడూ బ్లెస్ చేస్తా.. ఈ విషయంలో నేను హ్యాపీగానే ఉన్నాను అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.

ఒక హీరో అభిమానులు ఎదుటి హీరోల గురించి ఎందుకు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారో తెలియదు. అయితే మేము ఇప్పటివరకు మోహన్ బాబు బిడ్డలుగా ఎక్కడికి వెళ్లినా ప్రేమ, ఆదరణ పొందుకోవడమే తెలుసు కానీ.. ఈ నెగెటివిటీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియడం లేదు అంటూ మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం మంచు మనోజ్ రెండు పెళ్లి పై మంచు లక్ష్మి చేసిన షాకింగ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.