ఆ హీరోయిన్‌పై ఎన్టీఆర్ పొగ‌డ్త‌ల వ‌ర్షం.. ల‌క్ష్మీప్ర‌ణ‌తికి బాగా మండింద‌ట‌!?

సాధారణంగా ఏ భార్యకైనా తన భర్త మరొక మహిళను పొగుడుతుంటే కాస్త అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. కొందరికి అయితే ఎంతో అసూయ కూడా కలుగుతుంది. అలాంటి సందర్భమే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతికి కూడా ఎదురైందట.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో `జనతా గ్యారేజ్` ఒకటి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటించారు. 2016లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబ‌ట్టి ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమా సమయంలో‌ ఎన్టీఆర్ నిత్యామీనన్ పై పొగడ్తల వర్షం కురిపించాడు.

సాధారణంగా హీరోయిన్ల గురించి ఎన్టీఆర్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. కానీ, అప్పట్లో ఓ ఈవెంట్లో నిత్యామీనన్ పై ఎన్టీఆర్ కాస్త ఎక్కువగానే పొగడ్తల వర్షం కురిపించారట. దాంతో అక్కడే ఉన్న ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి కి బాగా మండిందట. ఈ విషయంలో ఆమె హర్ట్ అయ్యారని కూడా టాక్ నడిచింది. కాగా ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్ర‌స్తుతం ఈయన కొరటాల శివతో తన 30 చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఇది పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నాడు.