టాలీవుడ్ లో సీనియర్ హీరోలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి-నందమూరి బాలకృష్ణ ఇద్దరు తమ సినిమాలతో సంక్రాంతి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. చిరంజీవి నటిస్తున్న 154వ సినిమా వాల్తేరు వీరయ్య, బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి.
ఈ ఇద్దరు సీనియర్ హీరోలు గతంలో తమ సినిమాలతో ఎన్నోసార్లు పోటీపడ్డారు. అలాగే సంక్రాంతి బరిలో కూడా ఎన్నోసార్లు పోటీపడి విజయాలు సాధించారు. ఒకసారి బాలయ్య పై చేయి సాధిస్తే మరోసారి చిరంజీవి సినిమా హిట్ అయ్యేది 2017లో చివరి సారిగా వీరిద్దరూ తమ కెరీర్ లోనే ప్రతిష్టాత్మకమైన సినిమాలతో పోటీపడ్డారు.
బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి, చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాలు రిలీజ్ అయ్యాయి.. అయితే ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వసూళ్లపరంగా ఖైదీ నెంబర్ 150 సినిమా కాస్త ఎక్కువ వసూలు చేసిన బాలయ్య శాతకర్ణికి మంచి పేరు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలతో సంక్రాంతికి పోటీ పడుతున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ రెండు సినిమాలను పెద్ద బ్యానర్ అయిన మైత్రి మూవీస్ వాళ్ళు నిర్మిస్తున్నారు. తమ బ్యానర్లో రెండు పెద్ద హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నామన్న ఆనందం మైత్రి వాళ్లకు లేకుండా పోతుంది.
ఇద్దరు హీరోలు ఒకేసారి తమ సినిమాలను రిలీజ్ చేయాలన్న పంతానికి పోవడంతో ఒక్కో సినిమాకు 15 కోట్ల చొప్పున మొత్తం మైత్రి వాళ్లకు 30 కోట్ల వరకు నష్టాలు వస్తాయి అన్ని డ్రెడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రెండు సినిమాలు సోలోగా రిలీజ్ అయ్యి ఉంటే ఓపెనింగ్స్ కూడా ఒక్కో సినిమాకు ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు రెండు సినిమాలు ఒకేసారి రావడంతో అడ్వాన్సుల విషయంలో కూడా తక్కువగా వస్తాయని అంటున్నారు. ఏదేమైనా ఈ ఇద్దరు హీరోల్లో ఎవరో ఒకరు వెనక్కు తగ్గకపోతే మైత్రి వాళ్లకు భారీ నష్టాలు తప్పేలా లేవు.