సోము ప్రకంపనలు..ఆ ట్విస్ట్ ఏంటి?

ఏపీలో బీజేపీకి పెద్ద సీన్ లేదనే సంగతి తెలిసిందే…ఇక్కడ కనీసం ఒక్క సీటు కాదు కదా…ఒక్కశాతం ఓట్లు తెచ్చుకోవడం గొప్పే. అయితే జనసేనతో పొత్తు పెట్టుకుని ఏదొకవిధంగా బీజేపీ బండి లాగిస్తూ వస్తుంది. కానీ ఎంత చేసిన ఏపీలో బీజేపీ ఎదగడం లేదు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయని బీజేపీపై ఏపీ ప్రజలు కాస్త కోపంగానే ఉన్నారు. ఇలాంటి తరుణంలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. అటు చంద్రబాబు సైతం…బీజేపీకి దగ్గర అవ్వడానికి బాగానే కష్టపడుతున్నారు. ఈ మధ్య కష్టపడి మోదీని కూడా కలిశారు. ఈ క్రమంలో మళ్ళీ బీజేపీ-టీడీపీ పొత్తు ఖాయమైందని ప్రచారం జరిగింది. అటు జనసేన కూడా పొత్తులో ఉంటుంది..మళ్ళీ ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని వైసీపీని ఓడిస్తాయని ప్రచారం జరుగుతుంది.

ఇదే క్రమంలో ఏపీలోని బీజేపీ నేతలు తమ వర్షన్ ని మార్చుకున్నారు..ఇంతకాలం జగన్ కంటే బాబునే ఎక్కువ తిట్టిన నేతల్లో మార్పు వచ్చింది…రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు ఏ స్థాయిలో బాబుపై విరుచుకుపడతారో తెలిసిందే…అలాంటి నేత..ఇటీవల బాబుపై ప్రశంసలు కురిపించారు..అలాగే జగన్ పై విమర్శలు దాడి పెంచారు. తాజాగా ఏపీకి వచ్చిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం జగన్ పై విమర్శలు చేశారు. లిక్కర్‌ కింగ్‌ జగన్‌ను ఇంటికి పంపే సమయం ఆసన్నమైందని మాట్లాడారు.

ఇదే క్రమంలో సోము వీర్రాజు.. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని,  త్వరలోనే రాష్ట్రంలో ప్రకంపనలు చూడబోతున్నారుని మాట్లాడారు. ఆ ప్రకంపనలు ఏంటి అనేది మాత్రం క్లారిటీ లేదు. అయితే టీడీపీతో పొత్తు గురించే సోము పరోక్షంగా అలా మాట్లాడారని విశ్లేషకులు అంటున్నారు. బీజేపీకి సింగిల్ గా వైసీపీని గద్దె దించే సత్తా లేదు…అసలు సింగిల్ సీటు గెలుచుకునే బలం లేదు..కానీ టీడీపీతో పొత్తు పెట్టుకుని వైసీపీని గద్దె దించుతామనే కాన్ఫిడెన్స్ తో సోము ఉన్నారని అంటున్నారు. మరి సోము ప్రకంపనలు ఏంటో చూడాలి.