తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడిగా.. రచయితగా గుర్తింపు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ప్రస్తుతం ఈయన రాజ్యసభ సభ్యత్వాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ కు పూరీ జగన్నాథ్ అంటే విపరీతమైన ఇష్టం . అంతేకాదు ఆయన ఫోటోను విజయేంద్ర ప్రసాద్ తన మొబైల్ వాల్ పేపర్ గా పెట్టుకున్నారట. ఇక ఈ విషయాన్ని ఆయన పలు ఇంటర్వ్యూల ద్వారా వెల్లడించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వాల్ పేపర్ లో పెట్టుకునే అంత ఇష్టం ఎందుకు అని ప్రతి ఒక్కరిలో అనుమానాలు రేకెత్తుతున్నాయి.
నిజానికి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పూరి అంటే ఒక బ్రాండ్ .. ఆ బ్రాండ్ తోని సినిమా మార్కెట్ మొత్తం అయిపోయింది . అంతటి పేరు ప్రఖ్యాతలు కేవలం విజయాలతోనే సొంతం చేసుకోవడం గమనార్హం. అంతేకాదు ఈయన ఎక్కడికి వెళ్ళినా సరే స్టార్ హీరోలతో సమానంగా ట్రీట్ చేయబడతాడు. అలాగే సన్మానాలు కూడా అందుకుంటాడు. అందుకే చాలామంది ఇలా అభిమానులు సత్కరించడం ఆమోదయోగ్యమైనదే. కానీ ఒక పాన్ ఇండియా రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఆరాధించడం ఎందుకు అన్న విషయం కూడా ప్రస్తుతం అందరికీ అంత చిక్కడం లేదు.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్ ను మీ ఫేవరెట్ దర్శకుడు ఎవరు అని అనగానే మరో ఆలోచన లేకుండా పూరి జగన్నాథ్ అని చెప్పేశారు. అంతేకాదు ఆ మాటను నమ్ముతారో? లేదో? అని స్టార్ రైటర్ కి డౌట్ వచ్చి తన స్మార్ట్ ఫోన్ తీసి పూరీ బొమ్మను చూపించడం జరిగింది . ఇలా ఫోన్లో స్క్రీన్ పేపర్ పై పెట్టుకున్నారు అంటే ఆయన ఎంత అభిమానిస్తారో.. ఇష్టపడతారో ఇంతకుమించి చెప్పేదేముంది అంటూ అక్కడ ఇంటర్వ్యూ చేసిన యాంకర్ కూడా షాక్ అయ్యాడు.
ఎంతోమంది దర్శకుల దగ్గర పనిచేసిన విజయేంద్రప్రసాద్ పూరి జగన్నాథ్ లో ఒక యూనిక్ క్వాలిటీని చూశారు. అందుకే అంతగా అభిమానించడం మొదలుపెట్టారు చివరికి రాజమౌళి కూడా ఒక్కసారైనా పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాలి అన్నాడంటే ఈ తండ్రి కొడుకులు ఇద్దరికీ పూరీ అంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు.