విసుగొచ్చేసింది రా బాబు..టంగ్ స్లిప్ అయిన సాయిపల్లవి..ఆడేసుకుంటున్న నెటిజన్స్..!!

సాయి పల్లవి..హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ చేయకుండా కూడా అభిమానులను సంపాదించుకోగలరు అంటూ ప్రూవ్ చేసిన నటి. ఫిదా సినిమాలో భానుమతి క్యారెక్టర్ తో కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టించిన ఈ బ్యూటీ..ఇప్పుడు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ..సమాజానికి కొత్త సందేశాలు ఇస్తుంది. సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన “విరాటపర్వం” సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి..మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది . కమర్షీయల్ హిట్ కాకపోయినా..జనాల గుండెలకి హత్తుకున్న సినిమా అని చెప్పవచ్చు.

ప్రజెంట్ గార్గి అంటూ మరో సినిమా లో నటించింది. ఇది నాన్న సెంటిమెంట్ తో కూడిన సినిమా. తండ్రిని అనుకోని కేసులో కొందరు దుండగులు ఇరికిస్తే..ఓ కూతురు పడే ఆరాటం..తానే లాయర్ గా వాదించి నాన్న ని నిర్ధోషిగా చూపించే ప్రయత్నం చేసిన కధ అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమా జూలై 15 న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి ఓ ప్రెస్ మీట్ పాల్గొంది.

మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానమిస్తూ..ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో నే ఓ రిపోర్టర్..”వరుసగా మీరు అన్ని సందేశాత్మక చిత్రాలల్లోనే నటిస్తున్నారు. అభిమానులు మిమ్మలని ఓ చిల్ అవుట్ క్యారెక్టర్ లో చూడాలి అనుకుంటున్నారు. ఇంకా ఇలాంటి సీరియ‌స్ సినిమాలే ఎన్ని చేస్తారు అని అడగ్గా..ఆమె కూడా..అలానే అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ” నా దగ్గరకు వచ్చే కధలని అలాంటివే వస్తున్నాయి .

ట్రై చేస్తాను. నెక్స్ట్ సినిమాల్లో మీకు మంచి డ్యాన్స్ ఉండేలా కధ ఉంటుంది..” అని చెప్పుకొచ్చారు సాయిపల్లవి. దీంతో గత కొద్ది రోజుల నుండి సాయి పల్లవి ..NTR30 సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వస్తున్న విషయాని కన్ఫామ్ చేసిన్నట్లైంది సాయిపల్లవి. దీంతో కొందరు సాయి పల్లవి తనకు తెలియకుండా నే టంగ్ స్లిప్ అయ్యిందే..అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సాయి పల్లవి పై నెగిటీవ్ కామెంట్స్ ఎక్కువైన సంగతి తెలిసిందే.