పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. కె.రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న సౌత్ భాషలతో పాటుగా హిందీలోనూ గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న మేకర్స్.. గురవారం సాయంత్రం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రాధేశ్యామ్ ప్రిరిలీజ్ ఈవెంట్ను అట్టహాసంగా నిర్వహించారు.
ఈ ఈవెంట్కు రష్మి గౌతమ్తో పాటుగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్న నవీన్ పోలిశెట్టి కూడా యాంకర్గా వ్యవహరించి అదరగొట్టేశాడు. దీంతో ఈ ఈవెంట్కు నవీన్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడు అన్నదే ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది.
అయితే షాకింగ్ విషయం ఏంటంటే.. నవీన్ పొలిశెట్టి రాధేశ్యామ్ ఈవెంట్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. కేవలం ప్రభాస్ మీద అభిమానంతోనే ఈ ఈవెంట్కు వ్యాఖ్యాతగా వ్యవహరించాడట. నవీన్ పొలిశెట్టి నటించి జాతిరత్నాలు సినిమాకు అప్పట్లో ప్రభాస్ ఎంతగానో సపోర్ట్ చేశారన్న సంగతి తెలిసిందే.
అప్పుడు ప్రభాస్ చేసిన సహాయాన్ని గుర్తు పెట్టుకొనే.. నవీన్ పొలిశెట్టి ఇప్పుడు రాధేశ్యామ్కి తన వంతు సాయం చేశాడని ఇండస్ట్రీ వర్గాల సమచారం ద్వారా తెలుస్తోంది. కాగా, నవీన్ పొలిశెట్టి ప్రస్తుతం త్రివిక్రమ్ ప్రొడక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. అలాగే మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా ఈయన చేతిలో ఉన్నాయి.