ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్‌ల‌లో ఎవ‌రు బెస్టో తేల్చేసిన జ‌క్క‌న్న‌..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ఈ ముగ్గురు హీరోల‌తోనూ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ముగ్గురు హీరోల్లో ఎవ‌రు బెస్ట్‌..? అన్న ప్ర‌శ్న తాజాగా రాజ‌మౌళికి ఎదురైంది.

SS Rajamouli responds to Roar of RRR's success: 'As if we released the trailer itself' | Entertainment News,The Indian Express

దాంతో ఆయ‌న‌ ఏం స‌మాధానం చెబుతారా అని అంద‌రూ ఆస‌క్తిక‌రంగా ఎదురు చూడ‌గా.. జ‌క్క‌న్న మాత్రం చాలా స్మార్ట్‌గా అన్స‌ర్ ఇచ్చారు. ఆయ‌న మాట్లాడుతూ.. `ఒక్కొక్క సంద‌ర్భంలో ఒక్కొక్క‌రు ఇష్టం. సినిమా గురించి, యాక్టింగ్ గురించి ఏదైనా మాట్లాడాలంటే ఎన్టీఆర్‌తో స‌మ‌యం గ‌డ‌ప‌టానికి ఇష్ట‌ప‌డ‌తాను.

Poll : Will our stars like Prabhas, NTR and Ram Charan click in Bollywood? | 123telugu.com

అలాగే నాకు జంతువులు అంటే చాలా ఇష్టం. జంతువులు ఎలా ప్ర‌వ‌ర్తిస్తాయి. వాటి గురించి తెలుసుకోవ‌డానికి గంట‌ల స‌మ‌యం వెచ్చిస్తాను. వాటి గురించి మాట్లాడాలంటే రామ్‌చ‌ర‌ణ్‌తో స‌మ‌యం గ‌డ‌ప‌టానికి ఇష్ట‌ప‌డ‌తాను. అలాగే పుడ్ గురించి మాట్లాడాలంటే ప్ర‌భాస్‌తో టైమ్ స్పెండ్ చేయ‌డం ఇష్టం` అంటూ తేల్చేశారు. కాగా, రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌తో `ఆర్ఆర్ఆర్` చిత్రం చేసిన సంగ‌తి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 7న విడుద‌ల కాబోతోంది.