ఇప్పటి వరకు హీరోగానే అలరించిన నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ `ఆహా` వేదికగా హోస్ట్గా మారి `అన్ స్టాపబుల్` అనే టాక్ షోతో సందడి చేయబోతున్నారు. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్ నవంబరు 4న దీపావళి సందర్భంగా ప్రసారం కానుంది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు, ప్రోమోకు అద్భుతమైన రెస్పాన్స్ రాగా.. షో ఎప్పుడెప్పుడు స్టార్ అవుతుందా అని నందమూరి అభిమానులే కాకుండా ప్రేక్షకులు, సినీ తారలు సైతం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.
అలాగే ఈ షో మొత్తం 12 ఎపిసోడ్లుగా కాబోతుండగా.. మొదటి గెస్ట్ గా మోహన్ బాబు వచ్చారని తెలుస్తుండగా.. సెకండ్ గెస్ట్ గా నాగబాబు వస్తారని సమాచారం. ఇక ఆ తర్వాత న్యాచురల్ నాని, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, డైరెక్టర్ రాజమౌళి, వెంకటేష్ తదితరులు బాలయ్యతో అన్ స్టాపబుల్ గా సందడి చేయబోతున్నారని తెలుస్తోంది.