ఇప్పటి వరకు తెరపై నటుడిగానే ప్రేక్షకులను రంజింపచేసిన నందమూరి బాలకృష్ణ.. ఇకపై హోస్ట్గా కూడా అలరించబోతున్నారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ప్రసారం కాబోలో `ఆన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే` అనే షోకు బాలయ్య హోస్ట్గా వ్యవహరించబోతున్నారు. అయితే ఇప్పుడు ఈయన రూటులోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా వెళ్లబోతోందని తెలుస్తోంది.
ప్రస్తుతం తెలుగులో కీర్తి సురేష్..మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట, చిరంజీవితో భోళా శంకర్ చిత్రాలలో నటిస్తుంది. అలాగే ఈమె నటించిన గుడ్ లక్ సఖీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు తమిళ, మలయాళ భాషల్లోనూ ఈ భామ నటిస్తోంది. అయితే నటిగా మస్తు బిజీగా ఉన్న కీర్తి సురేష్.. త్వరలోనే హోస్ట్గా మారబోతోందట.
ప్రముఖ టీవీ ఛానెల్ వారు ఓ టాక్ షోను నిర్వహించాలని కసరత్తలు చేస్తున్నారట. అయితే ఈ టాక్ షోకు కీర్తి సురేష్ను హోస్ట్గా తీసుకుని.. ఆమె చేత సినీ పరిశ్రమకు చెందిన దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లను ఇంటర్వ్యూ చేయించాలని సదరు ఛానెల్ నిర్వాహకులు భావిస్తున్నారట. ప్రస్తుతం కీర్తితో సంప్రదింపులు జరుగుతున్నాయని.. అన్నీ కుదిరితే త్వరలోనే దీనిపై గుడ్న్యూస్ రానుందని తెలుస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.