మా సమస్య EC తోనే.. మంచు విష్ణు తో కాదు..!

తాజాగా మా ఎన్నికలు ముగిసిన అనంతరం మంచు విష్ణు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. చాలా బిజీగా ఉన్నారు మంచు విష్ణు. ఇక ఇప్పుడు తాజాగా తిరుపతికి వెళ్లి తమ ప్యానల్ సభ్యులతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొన్నాడు. ఇక ఇదే అదునుగా చూసుకొని ప్రకాశం మా ఎలక్షన్ లో జరిగే టప్పుడు ఏం జరిగిందోని సీసీ టీవీ ఫుటేజ్ ను చూసేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ వీడియో కూడా వైరల్ గా మారుతుంది.

ఎన్నికలు అయిపోయిన వెంటనే తనపై మోహన్ బాబు బూతులు తిట్టారంటు, దాడికి దిగారు అంటూ ప్రకాష్ రాజు ఫైనల్ సభ్యులు ఆరోపించి వారంతా రాజీనామా చేశారు. ఇక తాజాగా ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టి, మా ఎలక్షన్లల సీసీటీవీ ఫొటోస్ కావాలంటూ అధికారులను కోరడం జరిగింది. అయితే సీసీటీవీ ఫోటో చూడాలంటే.. ఇరు వర్గాల ప్యానెల్ సభ్యులు ఉండాలంటూ పోలీసులు తెలియజేశారు.

ఇక ఆ సీసీ టీవీ ఫుటేజ్ ను చూడడానికి మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు ఎవరూ రాలేదు. అందుకు కారణం మంచు విష్ణుతో పార్టీ వారంతా తిరుమల తిరుపతి కి వెళ్లారు. కేవలం సిసి టీవీ ఫొటోస్ కావాలంటూ కోరుతున్నారు ప్రకాష్ రాజ్. తన ఫైట్ అంతా కేవలం మంచు విష్ణు పై కాదు కేవలం EC తో అని చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్.