నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `అఖండ` ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తుండగా.. ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అలాగే సీనియర్ హీరో శ్రీకాంత్ ఈ మూవీలో విలన్గా కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా మే నెలలోనే విడుదల అవ్వాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
తాజాగా ఈ సినిమా విడుదలకు మేకర్స్ తేదీను ఖరారు చేశారట. దీపావళి కానుకగా నవంబర్ 4న అఖండను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.