టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్తో `లైగర్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని నటి చార్మి, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా తన అభిమానులకు విజయ్ దేవరకొండ అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పాడు. రేపు అనగా, సెప్టెంబర్ 27 వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఈ చిత్రం కి సంబంధించిన ఓ అదిరిపోయే అప్డేట్ రాబోతున్నట్టు విజయ్ దేవరకొండ ప్రకటించారు.
అయితే ఆ అప్డేట్ ఈ సినిమా టీజర్నే అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారమే నిజమైతే.. విజయ్ అభిమానులకు రేపు పండగే అవుతుంది. కాగా, తెలుగు, హిందీల్లో తెరకెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.