నందమూరి ఫ్యాన్స్.. పూరి జగన్నాథ్ బర్త్ డే కోసం వెయిటింగ్..!

టాలీవుడ్ లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్టార్ డైరెక్టర్ల ఒకరుగా పేరుపొందాడు.ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ అనే సినిమాని నిర్మిస్తున్నాడు.ఈ సినిమాకి చార్మి నిర్మాతగా వ్యవహరిస్తోంది.ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి హీరోయిన్ గా అనన్య పాండే నటిస్తోంది. ఇక ఇదిలా ఉండగా సెప్టెంబర్ 28న పూరిజగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా ఆ రోజున ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇక పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా నందమూరి అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారట. ఇక బాలకృష్ణతో పూరి జగన్నాథ్ ఒక సినిమా చేస్తానని గతంలో చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్లో పైసా వసూల్ సినిమా వచ్చి అది డిజాస్టర్ గా మిగిలింది.ఈ సినిమాలో బాలకృష్ణను ఒక కొత్తదనం హీరోగా చూపించడంతో సంబరపడ్డారట. ఇదే నేపథ్యంలో పూరిజగన్నాథ్ బర్తడే సెప్టెంబర్-28 న బాలయ్య సినిమాకు సంబంధించి ఏదైనా క్రేజీ అప్డేట్ ఉంటుందేమో అన్నట్లుగా నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అప్డేట్ ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే.