నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. ఏప్రిల్లోనే విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.
ప్రస్తుతం కరోనా అదుపులోకి వస్తుండడం, థియేటర్లు ఓపెన్ అవ్వడంతో.. ఒక్కొక్క సినిమా విడుదలకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లవ్ స్టోరీని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10కి విడుదల చేయబోతున్నట్టు ఇటీవల మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ, అదే తేదికి మరిన్ని సినిమాలు రిలీజ్కు సిద్ధమవడంతో.. లవ్ స్టోరీ మళ్లీ వాయిదా అంటూ ప్రచారం ఊపందుకుంది.
ఇలాంటి తరుణంలో మేకర్స్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఇంతకీ విషయం ఏంటంటే.. లవ్ స్టీరో రీషూట్కి వెళ్లిందట. కొన్ని సిన్సీను మరింత బెటర్ గా తీయాలన్న ఉద్దేశ్యంతో శేఖర్ కమ్ముల ఈ సినిమాకి మళ్లీ రీషూట్లు మొదలు పెట్టారని..అందుకోసం నిజామాబాదా వెళ్లారని టాక్ నడుస్తోంది. పది రోజుల్లో ఈ రీషూట్ షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. మరి ఇదే నిజమైతే.. లవ్స్టోరీ విడుదల సెప్టెంబర్లో లేనట్టే అని చెప్పొచ్చు.