అనసూయ భరధ్వాజ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై హాట్ యాంకర్గానే కాకుండా.. వెండితెరపై మంచి నటిగా కూడా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా సుకుమార్-రామ్ చరణ్ కాంబోలో వచ్చిన `రంగస్థలం` చిత్రంలో రంగమ్మత్తగా నటించి అనసూయ ప్రేక్షకులకు బాగా చేరవైంది.
ఈ చిత్రం తర్వాత అనసూయకు మరిన్ని అవకాశాలు తలుపుతడుతున్నాడు. ప్రస్తుతం టీవీ షోలతో పాటు పుష్ప, ఆచార్య, రంగమార్తాండ, రామారావు ఆన్ డ్యూటి వంటి చిత్రాల్లోనూ నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటే ఈ బ్యూటీ.. తాజాగా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది.
`మహిళలు తమ కార్లలో, బాత్రూంలలో, బెడ్ రూంలలో ఒత్తిడిని భరించలేక ఎన్ని సార్లు ఏడుస్తారో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు.. అయితే ఎంత బాధ ఉన్నా కూడా తన మొహాన్ని బయటకు చూపించేటప్పుడు మాత్రం నవ్వుతూనే ఉంటుంది.. ఆఫీస్లకు వెళ్తుంటుంది, ఇతర పనులను చేసుకుంటుంది.` అంటూ అనసూయ పేర్కొంది. అయితే ఉన్నట్టు ఉండి రంగమ్మత ఎందుకిలా పోస్ట్ పెట్టిందో తెలియకపోయినా.. ఆమె పోస్ట్ మాత్రం వైరల్గా మారింది.