అందుకే నిర్మాత‌గా మారాను..అస‌లు గుట్టు విప్పిన సందీప్ కిష‌న్!

టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో సందీప్ కిష‌న్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈయ‌న ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు నిర్మాతగా మారి సినిమాల‌ను నిర్మిస్తున్నారు. ఈయ‌న నిర్మాణంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వివాహ భోజ‌నంబు`. హాస్యనటుడు సత్య హీరోగా రామ్‌ అబ్బరాజు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో అర్జావీ రాజ్ హీరోయిన్‌గా, సందీప్ కిష్‌న్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

Sundeep Kishan and Satya's 'Vivaha Bhojanambu' gets OTT release date |  Telugu Movie News - Times of India

లాక్‌డౌన్‌తో ఇంటి నిండా బంధువులు ఉండిపోతే.. ఓ పిసినారి పెళ్లి కొడుకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే కథతో ఆద్యంతం నవ్వించేలా ఈ సినిమాను రూపొందించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగ‌ష్టు 27న ఓటీటీ వేదిక సోని లివ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో చిత్ర యూనిట్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తోంది.

Vivaha Bhojanambu Release: First in Theatres? - Vivaha Bhojanambu

ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న సందీఫ్ కిష‌న్.. ఎన్నో విష‌యాల‌ను షేర్ చేసుకున్నారు. స‌త్య త‌న యాక్టింగ్ స్కిల్స్ తో అద‌ర‌గొట్టేశాడని, వ‌న్ మ్యాన్ ఆర్మీలా సినిమాను న‌డిపించాడ‌ని చెప్పుకొచ్చాడు. అలాగే తాను నిర్మాత‌గా మార‌డానికి వెన‌కున్న గుట్టును కూడా విప్పేశాడు. యాక్ట‌ర్ గా నేను చేయ‌లేని కొన్నిక‌థ‌లున్నాయి. ఆ క‌థ‌ల‌ను తెర‌పై చూపించేందుకే నేను నిర్మాత‌గా మారాను. రాబోయే రోజుల్లో నేను మ‌రిన్ని కొత్త ఆలోచ‌న‌ల‌తో సినిమాలు చేస్తాను అని సందీప్‌ చెప్పుకొచ్చాడు.