వారం గ్యాప్‌లో బ‌రిలోకి దిగుతున్న మెగా హీరోలు..విజ‌యం ఎవ‌రిదో?

క‌రోనా సెకెండ్ వేవ్ ఉధృతి త‌గ్గుతూ వ‌స్తోంది. థియేట‌ర్‌లో ఓపెన్ అయ్యాయి. చిన్న చిన్న సినిమాల‌న్నీ ఒక్కొక్క‌టిగా విడుద‌ల అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మెగా హీరోలిద్ద‌రూ వారం గ్యాప్‌లో థియేట‌ర్‌లోకి దిగేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌, దేవకట్టా కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రిపబ్లిక్‌`.

Sai Dharam Tej: Republic only in cinema halls - tollywood

పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా రూపుదిద్దుకున్న‌ ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. ర‌మ్య‌కృష్ణ, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా మేకర్స్ ప్రకటించారు.

Vaishnav Tej, Krish Film's Release Date Locked!

మ‌రోవైపు సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు, యంగ్ హీరో వైష్ణ‌వ్ తేజ్ రెండో చిత్రం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన విష‌యం తెలిసిందే. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నవల ‘కొండపాలెం’ ఆధారంగా తెర‌కెక్కించారు. అయితే ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 8న విడుద‌ల చేయ‌నున్నారు. అంటే వారం గ్యాప్‌లోనే ఇటు అన్న సాయి తేజ్ – అటు త‌మ్ముడు వైష్ణవ్ తేజ్ తమ సినిమాలతో థియేటర్స్‌లో సందడి చేయబోతున్నారు. మ‌రి వీరిద్ద‌రిలో ఎవ‌రు విష‌యం సాధిస్తారో చూడాలి.