కీర్తి సురేష్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `నేను శైలజ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ మలయాళ ముద్దుగుమ్మ.. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో సర్కారు వారి పాట, గుడ్ లక్ సఖి చిత్రాల్లో నటిస్తోంది.
అయితే ఇప్పుడు కీర్తి ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. తమిళంలో కీర్తి సురేష్ నటించిన విభిన్నమైన సినిమా `సానికాయిధమ్`. మహేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సెల్వ రాఘవన్ కీలక పాత్ర పోషించారు.
అయితే ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది. కాగా, కీర్తి నటించిన పెంగ్విన్ చిత్రం ఆ మధ్య ఓటీటీలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కానీ, ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.